బాబ్రీ వివాదం.. తుది తీర్పుతో ముగిసేనా?
ABN, First Publish Date - 2020-09-21T08:21:37+05:30
అయోధ్యలో రామాలయ నిర్మాణం సాగుతున్న వేళ.. బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పునిచ్చేందుకు లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమవుతోంది. సెప్టెంబరు 30న న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించనున్నారు...
లఖ్నవూ, సెప్టెంబరు 20: అయోధ్యలో రామాలయ నిర్మాణం సాగుతున్న వేళ.. బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పునిచ్చేందుకు లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమవుతోంది. సెప్టెంబరు 30న న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించనున్నారు. ఈ కేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అడ్వానీ సహా సీనియర్ నేతలు మురళీమనోహర్ జోషీ, ఉమాభారతి, కల్యాణ్సింగ్ తదితరులు నిందితులుగా ఉండడంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎలా ఉన్నప్పటికీ.. ప్రతివాదులు హైకోర్టుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుండడంతో.. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు సాధ్యం కాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదిఏమైనప్పటికీ.. దేశంలో కేసు నమోదైన 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించనున్న తొలి కోర్టుగా లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రికార్డులకెక్కనుంది. ఈ కేసులో సీబీఐ.. మొత్తం 49 మందిని నిందితులుగా చేర్చగా.. ప్రస్తుతం 32 మంది మాత్రమే జీవించి ఉన్నారు.
Updated Date - 2020-09-21T08:21:37+05:30 IST