ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుకార్ల మీదే కేంద్ర మంత్రి రాజీనామా చేశారా? సంజయ్ రౌత్

ABN, First Publish Date - 2020-09-20T18:39:54+05:30

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు అనేక పుకార్లు సృష్టిస్తున్నాయన్న ప్రధాని మోదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు అనేక పుకార్లు సృష్టిస్తున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు శివసేన కౌంటర్ ఇచ్చింది. ఆదివారం కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ... ప్రతిపక్షాలు లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ అంటున్నారని, కేవలం పుకార్ల ఆధారంగానే అకాలీదళ్‌కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారా? చెప్పాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.


వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఆందోళనపై పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లులతో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉండదని కేంద్రం ప్రకటించిందని, ఒకవేళ అదే గనక నిజమైతే చాలా సంతోషించాల్సిన పరిణామమని ఆయన అన్నారు. ఈ వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత దేశంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోరన్న ధీమాను కేంద్రం ఇవ్వగలదా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 

Updated Date - 2020-09-20T18:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising