ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ బెంగాల్ వలస కూలీల బస్సు బోల్తా... ఏడుగురికి గాయాలు...

ABN, First Publish Date - 2020-05-30T22:17:12+05:30

కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న వలస కూలీల బస్సు ఒడిశాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలాసోర్ : కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న వలస కూలీల బస్సు ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. 


పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం  కేరళ వెళ్ళిన వలస కూలీలు దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల ఉపాధి కోల్పోయారు. దీంతో వీరు తమ స్వస్థలాలకు వెళ్ళిపోవడానికి ఈ బస్సులో బయల్దేరారు. మార్గమధ్యంలో శనివారం బాలాసోర్ పట్టణం సమీపంలో 16వ జాతీయ రహదారిపై ఈ బస్సు బోల్తా పడింది. 


కోల్‌కతా వెళ్తున్న ఈ బస్సులో 38 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సహకారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను కాపాడినట్లు తెలిపారు. గాయపడినవారిని బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 


మిగిలిన ప్రయాణికులను తాత్కాలిక శిబిరంలో ఉంచినట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఈ ప్రయాణికులంతా కోవిడ్-19 నిబంధనలను, భౌతిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వీరిని వేరొక బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2020-05-30T22:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising