కొన్ని రోజుల పాటు ‘వర్క్ ఫ్రం హోం’ చేయనున్న యడియూరప్ప
ABN, First Publish Date - 2020-07-10T21:09:53+05:30
కొన్ని రోజుల పాటు ఇంటి నుంచే అధికారిక విధులు నిర్వర్తిస్తానని ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం
బెంగళూరు : కొన్ని రోజుల పాటు ఇంటి నుంచే అధికారిక విధులు నిర్వర్తిస్తానని ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం ప్రకటించారు. ఆయన పేషీలోని కొందరు అధికారులకు కరోనా పాజిటివ్ అని తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అధికారులకు అవసరమైన సూచనలు, సలహాలు ఆన్లైన్ ద్వారా అందిస్తూనే ఉంటానని ఆయన ప్రకటించారు. ‘‘కొన్ని రోజుల పాటు నా ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తా. నా కార్యాలయంలోని సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందుకే ఈ నిర్ణయం’’ అని ఆయన ప్రకటించారు.
Updated Date - 2020-07-10T21:09:53+05:30 IST