ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి కరోనా పీడ వదిలిద్దాం: బ్రెజిల్ అధ్యక్షుడు

ABN, First Publish Date - 2020-04-04T21:19:36+05:30

బ్రెజీలాయా: దేశానికి పట్టిన కరోనా పీడ వదిలేందుకు ఆదివారం నాడు అందరూ ఉపవాసాలు ప్రార్థనలు చేయాలని బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ప్రజలకు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రెజీలాయా: దేశానికి పట్టిన కరోనా పీడ వదిలేందుకు ఆదివారం నాడు ప్రజలందరూ ఉపవాసాలు, ప్రార్థనలు చేయాలని బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో పిలుపునిచ్చారు. ఆదివారం నాడు ప్రజలందరూ ఈ విధంగా ప్రార్థనలు చేసి బ్రెజిల్ నుంచి కరోనా భూతాన్ని తరిమేయాలని కోరారు. బ్రెజిల్‌లోని పాస్టర్లు, ఇతర మతప్రచారకుల అభ్యర్థన మేరకు బోల్సోనారో ఈ ప్రకటన చేశారు. కరోనా కట్టడిలో బోల్సోనారో  విఫలమవుతున్నారనే వాదనలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఆయన ఇటీవల కొందరు మత ప్రచారకులను కలుసుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ‘బ్రెజిల్‌లో మత ప్రచారకులు పాస్టర్లలతో కలసి మనందరం ప్రార్థన చేయడానికి ఓ రోజు కేటాయిద్దాం. ఆ రోజు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి దేశానికి పట్టిన కరోనా పీడ వదిలేలా చేద్దాం’ అని  బోల్సోనారో పిలుపునిచ్చారు.  

Updated Date - 2020-04-04T21:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising