ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ప్రచారంలో కుప్పకూలిన బీజేపీ నేత.. మృతి

ABN, First Publish Date - 2020-11-23T00:02:38+05:30

ఎన్నికల ప్రచారం చేస్తూ ఓ బీజేపీ అభ్యర్థి మృతి చెందారు. ప్రచారంలో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే మృతి చెందారు. కేరళలోని కొల్లం జిల్లాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: ఎన్నికల ప్రచారం చేస్తూ ఓ బీజేపీ అభ్యర్థి మృతి చెందారు. ప్రచారంలో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే మృతి చెందారు. కేరళలోని కొల్లం జిల్లాలో జరిగిందీ ఘటన. మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేత విశ్వనాథన్ కొల్లం జిల్లాలో పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కొల్లం జిల్లాలో పర్యటించారు. క్యాంపెయినింగ్‌లో భాగంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే ఉన్నట్లుండి మైక్ వదిలేసి కుప్పకూలిపోయారు.


వెంటనే పక్కనున్న కార్యకర్తలంతా కలిసి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తలించారు. అయితే విశ్వనాథన్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళా నేత క్యాంపెయినింగ్ సందర్భంగా పక్కనున్న చెట్టు విరిగి పడడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.

Updated Date - 2020-11-23T00:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising