ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరు హింసాకాండ కేసులో కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త అరెస్ట్

ABN, First Publish Date - 2020-08-14T15:17:46+05:30

బెంగళూరులో జరిగిన హింసాకాండ కేసులో నిందితుడైన బృహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) నాగ్వారా వార్డు కార్పొరేటర్ ఇర్షాద్ బేగం భర్త, కాంగ్రెస్ నాయకుడు కలీంపాషాను పోలీసులు అరెస్టు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (కర్ణాటక): బెంగళూరులో జరిగిన హింసాకాండ కేసులో నిందితుడైన బృహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) నాగ్వారా వార్డు కార్పొరేటర్ ఇర్షాద్ బేగం భర్త, కాంగ్రెస్ నాయకుడు కలీంపాషాను పోలీసులు అరెస్టు చేశారు. కలీంపాషా కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కేజే జార్జ్ కు సన్నిహితుడని పోలీసులు చెప్పారు. హింసాకాండ కేసులో నిందితుడైన కలీంపాషా మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఉన్న చిత్రం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.ఈ నేపథ్యంలో బెంగళూరు హింసాకాండను మాజీ సీఎం సిద్ధరామయ్య ఖండించలేదని బీజేపీ నాయకుడు సంతోష్ ఆరోపించారు. బెంగళూరు హింసాకాండ కేసులో 60 మందిని అరెస్టు చేశామని బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ చెప్పారు. 206 మందిని అదుపులోకి తీసుకున్నామని పాటిల్ పేర్కొన్నారు.ఈ కేసును నాలుగు బృందాలు దర్యాప్తు చేసి నిందితులైన ఎస్‌డీపీఐ సభ్యులను అరెస్టు చేశారు.

Updated Date - 2020-08-14T15:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising