ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికపై అత్యాచారం, హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం!

ABN, First Publish Date - 2020-08-22T23:38:59+05:30

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో దారుణం జరిగింది. 16 బాలికపై పలుమార్లు అత్యాచారానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జల్పాయిగురి: పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో దారుణం జరిగింది. 16 బాలికపై పలుమార్లు అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆపై ఆమెను దారుణంగా హతమార్చి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం వారికి 8 రోజుల పోలీసుల కస్టడీకి ఆదేశించింది. 


రాజ్‌గంజ్‌లోని శ్యానషికతకు చెందిన బాధిత బాలిక ఈ నెల 10న అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం తల్లిదండ్రులు గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 15న బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు విచారణలో నిందితులు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం బాలిక మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేసినట్టు తెలిపారు. ప్రధాన్ పరాలోని ఓ ఇంటిలో పడేసిన సెప్టిక్ ట్యాంకు నుంచి మృతదేహాన్ని వెలికి తీసినట్టు పోలీసులు పేర్కొన్నారు.  

Updated Date - 2020-08-22T23:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising