ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి పండించడంపై నిషేధాన్ని సాంఘిక సంస్కరణ అంటున్న హర్యానా మంత్రి

ABN, First Publish Date - 2020-05-13T21:53:03+05:30

హర్యానాలో కొన్ని చోట్ల వరి పండించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్ : హర్యానాలో కొన్ని చోట్ల వరి పండించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘మేరా పానీ, మేరీ విరాసత్’ పథకంలో భాగంగా దీనిని అమలు చేస్తున్నారు. ఇది సాంఘిక సంస్కరణ అని ఆ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి జేపీ దలాల్ అన్నారు. 


హర్యానా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, హర్యానాలో వరి పండించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఏటా ఒక మీటరు వరకు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఒక కేజీ వరి పండించడానికి దాదాపు 2,000 నుంచి 5,000 లీటర్ల వరకు నీరు అవసరమవుతోంది. 


ఈ నేపథ్యంలో ఇటీవలే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ ‘మేరా పానీ, మేరీ విరాసత్’ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ఎనిమిది బ్లాకుల్లో వరి పండించడంపై నిషేధం విధించారు.


వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి జేపీ దలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎనిమిది బ్లాకుల్లో వరి పండించడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ చర్య నీటి సంరక్షణ కోసం అమలు చేస్తున్న సాంఘిక సంస్కరణ అని పేర్కొన్నారు. వరి పండించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని,  ఏటా ఒక మీటరు వరకు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని తెలిపారు. ఒక కేజీ వరి పండించడానికి దాదాపు 2,000 నుంచి 5,000 లీటర్ల వరకు నీరు అవసరమవుతోందన్నారు. నీటిని ఆదా చేయడానికి ఈ సంస్కరణలను అమలు చేయవలసి ఉందన్నారు.


Updated Date - 2020-05-13T21:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising