దీపావళి రోజు పటాకులు పేలవడం మానుకోండి: పర్యావరణ శాఖ మంత్రి
ABN, First Publish Date - 2020-11-04T03:56:47+05:30
దీపావళి రోజు పటాకులు పేలవడం మానుకోండి: పర్యావరణ శాఖ మంత్రి
న్యూఢిల్లీ: దీపావళి పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజలకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ పలు సూచనలు చేశారు. ఆరోగ్యం మరియు పర్యావరణ ప్రయోజనాల కోసం దీపావళి సందర్భంగా వీలైనంత వరకు పటాకులు పేలవడం మానుకోవాలని ప్రజలను పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం కోరారు.
ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, అన్ని జిల్లా న్యాయాధికారులు మరియు పోలీసులను గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించేలా చూడాలని కోరినట్లు రాయ్ తెలిపారు. దేశ రాజధానిలోని క్రాకర్ షాపులను కూడా మంత్రి పరిశీలించారు.
Updated Date - 2020-11-04T03:56:47+05:30 IST