ఎల్ఏసీ వద్ద పర్యటించిన ఆర్మీ చీఫ్ జనరల్
ABN, First Publish Date - 2020-05-23T23:22:00+05:30
చైనా, భారత్ల మధ్యగల వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఇటీవల కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన...
న్యూఢిల్లీ: చైనా, భారత్ల మధ్యగల వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఇటీవల కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై విచారించేందుకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా లేహ్ ప్రాంతంలోని 14 సైనిక బృందాలకు చెందిన ముఖ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఉన్నత స్థాయి కమాండర్లు నరవాణేకు అక్కడి పరిస్థితులను వివరించారు. చైనా సైనికులు, భారత సైనికుల మధ్య జరిగిన ప్రతి విషయాన్ని ఆయనకు వివరించారు.
Updated Date - 2020-05-23T23:22:00+05:30 IST