అధికార అన్నాడీఎంకేలో కరోనా గుబులు.. ఇవాళ కొత్తగా..
ABN, First Publish Date - 2020-07-05T21:32:47+05:30
తమిళనాడులో ప్రజల్లోనే కాదు ప్రజాప్రతినిధుల్లో కూడా కరోనా గుబులు...
కోయంబత్తూరు ఎమ్మెల్యే అమ్మన్ అర్జునన్కు కరోనా
కోయంబత్తూర్: తమిళనాడులో ప్రజల్లోనే కాదు ప్రజాప్రతినిధుల్లో కూడా కరోనా గుబులు రేపుతోంది. మరీ ముఖ్యంగా.. అధికార పార్టీ అన్నాడీఎంకే నేతల్లో కరోనా భయం మరింత పెరిగిపోతోంది. తాజాగా.. కోయంబత్తూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యే అమ్మన్ అర్జునన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో.. కరోనా బారిన పడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరింది. అమ్మన్ అర్జునన్ స్వాబ్ శాంపిల్ ఇచ్చారు. తొలుత నెగిటివ్ వచ్చినప్పటికీ మరోమారు పరీక్షించగా.. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆయన కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చినప్పటికీ వారిని హోం క్వారంటైన్లోనే ఉండాలని వైద్యులు సూచించారు.
ఎమ్మెల్యే అమ్మన్ అర్జునన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్.పి.వేలుమణి ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. కోయంబత్తూరులో కరోనా సోకి చికిత్స పొందుతున్న 57 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. అయితే.. కరోనా సోకిన ఆ వ్యక్తికి ఇదివరకే డయాబెటిస్, బీపీ, హృదయ సంబంధ సమస్యలు ఉన్నట్లు వైద్య శాఖ తెలిపింది.
Updated Date - 2020-07-05T21:32:47+05:30 IST