ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖిలేష్ విమర్శలతో దిగొచ్చిన యోగి సర్కారు.. గంటల్లోనే నిర్ణయం వాపస్

ABN, First Publish Date - 2020-05-24T21:47:30+05:30

లక్నో: కరోనా ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డుల్లోకి పేషంట్లు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దంటూ జారీ చేసిన ఆదేశాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: కరోనా ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డుల్లోకి పేషంట్లు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దంటూ జారీ చేసిన ఆదేశాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. కోవిడ్ ఆసుపత్రుల్లో చేరే పేషంట్లు ఇకపై వార్డుల్లోకి వెళ్లక ముందే మొబైల్ ఫోన్లను వార్డు ఇంఛార్జికి అప్పగించాల్సి ఉంటుందంటూ నిన్న జారీ చేసిన ఉత్తర్వులను వాపస్ తీసుకుంది. వార్డుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించడం వల్ల ప్రయోజనం ఉండదంటూ యూపీ మాజీ సీఎం అఖిలేష్ విమర్శలు గుప్పించిన గంటల్లోనే యోగి సర్కారు మేల్కొంది. వెంటనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. 


ఆసుపత్రుల్లో అధ్వాన్న పరిస్థితులపై వీడియోలు తీస్తారనే ఉద్దేశంతోటే మొబైల్ ఫోన్లపై ప్రభుత్వం వార్డుల్లోకి మొబైల్ ఫోన్లను బ్యాన్ చేసిందని అఖిలేష్ ఆరోపించారు. ఫోన్లను బ్యాన్ చేయడం కాకుండా వార్డుల శానిటేషన్ చేయాలంటూ అఖిలేష్ ట్వీట్ చేశారు. 


మొబైల్ ఫోన్ల ద్వారా ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం నిన్న జారీ చేసిన ఆదేశాల్లో ఉంది. దీనిపై అఖిలేష్ సెటైర్లు వేశారు.  

Updated Date - 2020-05-24T21:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising