ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతి తీవ్రంగా ‘ఆంఫన్‌’

ABN, First Publish Date - 2020-05-18T08:28:48+05:30

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘ఆంఫన్‌’ తుపాను ఆదివారం బలపడింది. ఉదయానికి తీవ్ర తుపానుగా, సాయంత్రానికి అతితీవ్ర తుపానుగా మారింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా మారనుందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పెను తుపానుగా మారే అవకాశం


అమరావతి/విశాఖపట్నం/న్యూఢిల్లీ, మే 17(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘ఆంఫన్‌’ తుపాను ఆదివారం బలపడింది. ఉదయానికి తీవ్ర తుపానుగా, సాయంత్రానికి అతితీవ్ర తుపానుగా మారింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా మారనుందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా 20న పశ్చిమ బెంగాల్‌లో సాగర్‌ దీవులు, బంగ్లాదేశ్‌లో హతియా దీవుల మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో కోస్తా ఆంధ్రలో ఆదివారం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు పడ్డాయి. సోమ, మంగళవారాల్లోనూ ఏపీలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావంతో ఈనెల 19, 20న ఒడిశా తీరప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర పెనుగాలులతో పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా, రైతులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు ఆదివారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ప్రకటించింది. 


Updated Date - 2020-05-18T08:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising