ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలికి కరోనా
ABN, First Publish Date - 2020-04-01T17:09:58+05:30
దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు...
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు కోవిడ్ -19 వైరస్ బారిన పడ్డారు. దీనితో డాక్టర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో పనిచేస్తున్న వైద్యురాలికి కోవిడ్ -19 పరీక్ష సానుకూలంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. ఆ వైద్యురాలు ఇటీవల ఆమె సోదరుడి ఇంటిని సందర్శించారు. ఆయన కొన్ని రోజుల క్రితం యూకె నుండి తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఇప్పటివరకు 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యానని సత్యేంద్ర జైన్ తెలిపారు.
Updated Date - 2020-04-01T17:09:58+05:30 IST