బ్రిటన్లో ఒక్కరోజులో 708 కరోనా మరణాలు..
ABN, First Publish Date - 2020-04-05T02:57:03+05:30
ప్రపంచంలో అలజడి సృష్టిస్తున్న కరీనా మహమ్మారి బ్రిటన్ను భయపెడుతోంది. గత మూడు రోజులుగా ఈ వైరస్ కారణంగా....
లండన్: ప్రపంచంలో అలజడి సృష్టిస్తున్న కరీనా మహమ్మారి బ్రిటన్ను భయపెడుతోంది. గత మూడు రోజులుగా ఈ వైరస్ కారణంగా ఇక్కడ మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం ఈ సంఖ్య 569గా ఉంది. శుక్రవారంనాడు 684మంది ఈ వైరస్ కు బలయ్యారు. ఇప్పుడు తాజాగా శనివారంనాడు బ్రిటన్ లో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో 708కి చేరాయి. ఇప్పటివరకు ఇంగ్లాండ్ లో ఒక్కరోజులో సంభవించిన కరోనా మరణాల్లో ఇవే అత్యధికం. దీంతో బ్రిటన్ లో కరోనా మరణాల సంఖ్య 4,313కు చేరింది. బ్రిటన్ లో మొత్తం 41,903 మందికి ఈ వైరస్ సోకింది. దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఇటివలే కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. అలాగే బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కూడా తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు.
Updated Date - 2020-04-05T02:57:03+05:30 IST