ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఆర్‌పీఎఫ్‌లో మరో 67 మందికి కరోనా..

ABN, First Publish Date - 2020-05-10T02:51:04+05:30

దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)లో కరోనా మహమ్మారి కలవరం రేపుతోంది. ఇవాళ మరో 62 మంది జవాన్లకు కొవిడ్-19 పాజిటివ్ సోకినట్టు గుర్తించారు. ఈ కేసులన్నీ ఢిల్లీకి చెందిన ఒకే యూనిట్‌లో నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం చికిత్స పొందుతున్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది సంఖ్య 231కి చేరింది. ఇప్పటి వరకు ఇద్దరు జవాన్లు ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఓ జవాను మృతి చెందారు.


కాగా తాజా కేసులన్నీ సీఆర్‌పీఎఫ్‌లోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) 194వ బెటాలియన్‌లోనే ఉన్నట్టు  అధికారులు వెల్లడించారు. వీరికి బవానాలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ 31వ బెటాలియన్‌లో 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందర్నీ మండోలిలోని క్వారంటైన్ కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత నెలలో 55 ఏళ్ల ఓ సీఆర్‌పీఎఫ్ అధికారి మృతి చెందిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-05-10T02:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising