ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపహరించిన పౌరుల్ని తిరిగి అప్పగించనున్న చైనా ఆర్మీ

ABN, First Publish Date - 2020-09-12T14:57:35+05:30

అపహరించిన ఐదుగురు భారతీయుల్ని చైనా ఆర్మీ శనివారం తిరిగి భారత్‌కు అప్పగించనుంది. ఈ విషయాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అపహరించిన ఐదుగురు భారతీయుల్ని చైనా ఆర్మీ శనివారం తిరిగి భారత్‌కు అప్పగించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. నిర్దేశించిన ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు చైనా ఆర్మీ ఆ యువకులను భారత దళాలకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. కిబితూ సరిహద్దుల్లో ఉన్న వాఛా ప్రదేశం దగ్గర భారత దళాలకు యువకులను అప్పగిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పౌరులను సెప్టెంబర్ నాలుగో తేదీన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు అపహరించారు. అప్పర్ సుబన్ సిరి జిల్లాలోని నాచో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ దీనిపై పీఎంవోకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-09-12T14:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising