24 గంటల్లో 336 కరోనా కేసులు.. 12 మరణాలు
ABN, First Publish Date - 2020-04-03T22:36:23+05:30
24 గంటల్లో 336 కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అంతేకాకుండా 12 మంది కరోనా...
న్యూఢిల్లీ: 24 గంటల్లో 336 కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అంతేకాకుండా 12 మంది కరోనా బాధితులు మరణించినట్లు తెలిపారు. ‘గత రెండు రోజుల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 647 మంది తబ్లీగీ జమాత్కు హాజరైన వారేనని, వీరంతా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వారని అగర్వాల్ చెప్పారు. ఇప్పటివరకు భారత్లో మొత్తం 2,301 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు.
Updated Date - 2020-04-03T22:36:23+05:30 IST