32 మంది ఖైదీలకు కరోనా.. ఎక్కడంటే?
ABN, First Publish Date - 2020-07-14T04:06:28+05:30
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కర్ణాటకలో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది.
బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కర్ణాటకలో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని బెంగళూరులోని పారప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఖైదీలో కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తమ్మీద కొత్తగా 32 మంది ఖైదీలు కరోనా పాజిటివ్గా తేలినట్లు జైలు అధికారులు తెలిపారు. వీరిలో 31 మంది పురుషులుకాగా, ఒక మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖైదీలందరికీ గడిచిన 20 రోజుల వ్యవధిలోనే అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. ఖైదీల్లో మగవాళ్లను హజ్ భవన్కు, మహిళను శ్రీశ్రీ రవిశంకర్ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించారు. కాగా, మొత్తమ్మీద కర్ణాటకలో 38,843 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 15,409మంది కోలుకున్నారు. 684 మంది ఈ వైరస్కు బలయ్యారు.
Updated Date - 2020-07-14T04:06:28+05:30 IST