ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో కొత్తగా 29 కరోనా పాజిటివ్ కేసులు: సీఎం ప్రకటన

ABN, First Publish Date - 2020-05-18T22:54:01+05:30

కేరళలో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నాళ్లు పూర్తిగా తగ్గినట్టు కనిపించినప్పటికీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళలో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నాళ్లు పూర్తిగా తగ్గినట్టు కనిపించినప్పటికీ మళ్లీ కరోనా కేరళను వెంటాడుతోంది. సోమవారం కేరళలో కొత్తగా 29 పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఈ 29 కేసుల్లో 21 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారేనని సీఎం తెలిపారు.


ఏడుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారని, ఒకరికి కరోనా సోకిన వ్యక్తి వల్ల వ్యాప్తి చెంది.. అతనికి కరోనా సోకిందని సీఎం వెల్లడించారు. సోమవారం డిశ్చార్జ్‌లేవి లేకపోవడం గమనార్హం. కేరళలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 630కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 130.

Updated Date - 2020-05-18T22:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising