కరోనా అలర్ట్: మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే..
ABN, First Publish Date - 2020-04-05T17:55:09+05:30
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా...
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 26 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికి 661కి చేరింది. ఇదిలా ఉంటే.. కరోనా బారిన పడి ఆదివారం పుణెలోని ససూన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 52 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. పుణె జిల్లాలో ఇప్పటివరకూ కరోనా సోకి నలుగురు మరణించారు. మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య 11కు చేరింది.
Updated Date - 2020-04-05T17:55:09+05:30 IST