ముంబైలో ఊహించని రీతిలో.. శుక్రవారం ఒక్కరోజే..
ABN, First Publish Date - 2020-04-11T00:52:13+05:30
ముంబై నగరంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముంబైలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా..
ముంబై నగరంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముంబైలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదయినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ముంబైలో కరోనా బారిన పడి 10 మంది మరణించినట్లు స్పష్టం చేసింది.
దీంతో.. ఒక్క ముంబై నగరంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 993కు చేరుకుంది. ముంబైలో కరోనా మూలాన మరణించిన వారి సంఖ్య 64కు చేరింది. కరోనా ధాటికి ముంబై నగరం విలవిలలాడుతోంది. నగరంలోని పలు ప్రాంతాలను ఇప్పటికే కరోనా హాట్స్పాట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
Updated Date - 2020-04-11T00:52:13+05:30 IST