ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సాయంపై కేంద్రానికి ట్రాన్స్‌జెండర్స్ లేఖ

ABN, First Publish Date - 2020-04-29T00:39:50+05:30

యాచక వృత్తి, పడుపు వృత్తే తమ జీవనాధారాలుగా మారాయని అన్నారు. అయితే నేటి పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన నిబందనల కారణంగా ఆ పనులు చేసే అవకాశం కూడా లేదని, దీంతో తాము ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ వల్ల కారణంగా తాము చాలా దెబ్బ తిన్నామని, తమకు వెంటనే లాక్‌డౌన్ సాయం కింద ప్రత్యేక ప్యాకేజీ అందించాలని 2,100 మంది ట్రాన్స్‌జెండర్లు కేంద్రానికి లేఖ రాశారు. దేశ చరిత్రలో ట్రాన్స్‌జెండర్ల కమ్యూనిటీకి ఎదురైన అతి పెద్ద విపత్తు ఇదేనని కేంద్రానికి రాసిన లేఖలో వారు పేర్కొన్నారు. చాలా మంది పేదరకింలో సామాజిక మినహాయింపులో జీవిస్తున్నారని.. యాచక వృత్తి, పడుపు వృత్తే తమ జీవనాధారాలుగా మారాయని అన్నారు. అయితే నేటి పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన నిబందనల కారణంగా ఆ పనులు చేసే అవకాశం కూడా లేదని, దీంతో తాము ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.


దేశంలో నెలకొన్న పరిస్థితులను తాము అర్థం చేసుకున్నామని, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని ట్రాన్స్‌జెండర్లు పేర్కొన్నారు. అయితే ఈ లాక్‌డౌన్ దేశ వ్యాప్తంగా తమ కమ్యూనిటీని తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. ఆహార కొరత, ఆరోగ్య సమస్యలతో లక్షలాది మంది ట్రాన్స్‌జెండర్లు అవస్థలు పడుతున్నారని, ఈ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సాయం అందించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. కేంద్రానికి రాసిన లేఖలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి తవార్ చంద్ గెహ్లాట్, హోంమంత్రి అమిత్ షాలను ప్రస్తావించారు.

Updated Date - 2020-04-29T00:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising