ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాలపై విరిగి పడిన కొండచరియలు.. రైలు బ్రేకులు వేసినా..

ABN, First Publish Date - 2020-03-30T21:02:17+05:30

వేగంగా వెళ్తోందా రైలు. ఇంతలో పట్టాలకు అడ్డుగా కొన్ని రాళ్ల కుప్పలు ఉండటం చూశాడు దాని డ్రైవర్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హునాన్: వేగంగా వెళ్తోందా రైలు. ఇంతలో పట్టాలకు అడ్డుగా కొన్ని రాళ్ల కుప్పలు ఉండటం చూశాడు దాని డ్రైవర్. వెంటనే స్పందించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆగిపోయిన రైలు చక్రాలు పట్టాలపై జారి నిప్పురవ్వలు వెదజల్లుతుండగా.. ఆ ట్రైన్ వెళ్లి పట్టాలకు అడ్డంగా ఉన్న రాళ్లగుట్టను ఢీకొట్టింది. అంతే ఆ ధాటికి అయిదు బోగీలు పట్టాలు తప్పి పడిపోయాయి. దాని ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో సోమవారం చోటుచేసుకుంది. చెంజో సిటీ నుంచి గాంగ్‌‌జో ప్రాంతానికి వెళ్తున్న రైలుకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని, కానీ 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-03-30T21:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising