ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధారావీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

ABN, First Publish Date - 2020-04-05T01:42:32+05:30

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబై ధారావీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబై ధారావీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. అయితే వైరస్ సోకిన వారిని క్వారెంటైన్‌లో ఉంచామని.. వారితో ఉన్న వారి గురించి కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్పారు. 


కేవలం ఐదు కిలోమీటర్ల విస్తీరణం ఉన్న ఈ ప్రాంతంలో లక్షలాది మంది జీవనం గడుపుతుంటారు. దీంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడం చాలా కష్టతరమైన విషయం. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి సులభంగా సోకే కరోనా వైరస్ ఈ ప్రాంతంలో సులభంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఇక్కడ పకడ్బందీగా వైద్య సేవలు అందించేందుకు అధికారులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి మృతి చెందాడు. దీంతో మిగితావారికి ఈ వ్యాధి సోకకుండా ఏర్పాట్లు చేయడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.


ఇప్పటికే ముంబైలో 420 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య మూడు వేలు దాటింది. 

Updated Date - 2020-04-05T01:42:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising