ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షాలతో కుప్పకూలిన 151 ఏళ్ల పురాతన చర్చి

ABN, First Publish Date - 2020-08-12T01:48:21+05:30

భారీ వర్షాల కారణంగా ఓ చెరువు తెగిపోవడంతో కేరళలో 151 ఏళ్ల నాటి ఓ పురాతన చర్చి కూలిపోయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: భారీ వర్షాల కారణంగా కేరళలోని 151 ఏళ్ల నాటి ఓ పురాతన చర్చి కూలిపోయింది. ఇవాళ ఉదయం అలప్పూజ జిల్లా చుంగాం కురువెల్లి పదశేఖరం ప్రాంతంలోని సెయింట్ పాల్ సీఎస్ఐ చర్చి కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. సమీపంలోని ఓ చెరువుగట్టు తెగిపోవడంతో రెండు వరిపొలాల మధ్య ఉన్న ఈ చర్చిలోకి వరదనీరు ప్రవేశించిందనీ.. దీని కారణంగానే చర్చి కూలిపోయిందని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పెద్దఎత్తున వరద పోటెత్తడంతో అధికారుల ముందస్తు హెచ్చరికలతో స్థానికులు అప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లాలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

Updated Date - 2020-08-12T01:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising