ఒక్క జిల్లాలో ఒక్కరోజే 1,388 కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-07-08T04:48:25+05:30
మహారాష్ట్రలోని థానే జిల్లాను కరోనా మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. ఈ ఒక్క జిల్లాలో...
థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాను కరోనా మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. ఈ ఒక్క జిల్లాలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 1,388 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ ముంబై పరిధిలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతుండగా.. థానే జిల్లాలో మంగళవారం ముంబైని మించి కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. థానే జిల్లాలో కరోనా మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 45 మంది ఈ జిల్లాలో కరోనా వల్ల మృతి చెందారు.
దీంతో.. థానే జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 1,353కు చేరింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,264కు చేరింది. ముంబైలో మంగళవారం కొత్తగా 806 కరోనా పాజిటివ్ కేసులు, 64 కరోనా మరణాలు నమోదయ్యాయి. ముంబైలో ఇప్పటివరకూ 86,132 మంది కరోనా బారిన పడ్డారు. 4,999 మంది కరోనా వల్ల మరణించారు.
Updated Date - 2020-07-08T04:48:25+05:30 IST