కర్ణాటకలో కొత్తగా 130 కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-05-24T23:30:18+05:30
కర్ణాటకలో కొత్తగా 130 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం...
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా 130 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 130 కోవిడ్-19 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీటితో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2,089కి చేరింది. వీరిలో 654 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 1391 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది మృత్యువాత పడ్డారు.
Updated Date - 2020-05-24T23:30:18+05:30 IST