24 గంటల్లో 12 కరోనా మరణాలు.. దేశంలో ఇదే అత్యధికం
ABN, First Publish Date - 2020-04-02T23:17:05+05:30
24 గంటల వ్యవధిలో 12 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం...
న్యూఢిల్లీ: 24 గంటల వ్యవధిలో 12 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం దేశంలో ఇదే తొలిసారని ఆయన చెప్పారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 328 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని, వీటితో కలుపుకొని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,965 కరోనా కేసులు నమోదు కాగా, 50 మంది మృతి చెందినట్లు లవ్ అగర్వాలు తెలిపారు.
Updated Date - 2020-04-02T23:17:05+05:30 IST