కరోనాపై ఆన్లైన్లో తప్పుడు వార్తలు షేర్ చేసిన 113 మందిపై ఎఫ్ఐఆర్
ABN, First Publish Date - 2020-04-08T04:26:59+05:30
కరోనా వైరస్, లాక్డౌన్లకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు షేర్ చేసిన 113 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు...
ముంబై: కరోనా వైరస్, లాక్డౌన్లకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు షేర్ చేసిన 113 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ పోలీసులు తెలిపారు. ‘కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినందుకు, కులాలను దూషిస్తూ పోస్టులు పెట్టినందుకుగానూ 113 మందిపై మహారాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశార’ని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉంటే కోవిడ్-19కు సంబంధించి ట్విటర్లో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న 100 మందిపై సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఏప్రిల్ 6న వెల్లడించారు.
Updated Date - 2020-04-08T04:26:59+05:30 IST