కరోనా రిపోర్ట్: కర్ణాటకలో కొత్తగా 101 కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-05-26T23:15:17+05:30
కర్ణాటకలో కొత్తగా 101 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ...
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా 101 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 101 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 43 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2,283కి చేరింది. 748 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 1,489 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా 44 మంది మృత్యువాత పడ్డారు.
Updated Date - 2020-05-26T23:15:17+05:30 IST