ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటరు కేంద్రాలు వెల వెల.. నిద్రపోతున్న పోలింగ్ సిబ్బంది

ABN, First Publish Date - 2020-12-01T21:30:16+05:30

బల్దియా ఎన్నికల పోలింగ్ దారుణంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ కేవలం 25.35 శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: బల్దియా ఎన్నికల పోలింగ్ దారుణంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ కేవలం 25.35 శాతం  మాత్రమే నమోదు కావడం గమనార్హం.  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మాదాపూర్, గచ్చిబౌలి, పాతబస్తీ, తదితర ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు. శివారు ప్రాంతాల్లోని ప్రజలకు ఉన్న  ఆసక్తి  ఐటీ ఉద్యోగులకు ఉండడం లేదు. పోలింగ్ బూత్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు లేక  సిబ్బంది నిద్రపోయే పరిస్థితి ఏర్పడింది.


జీహెచ్ఎంసీలో ప్రతిసారి తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఈసారి కూడా పోలింగ్ శాతం పెంచాలని అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు, కాని ఈసారి కూడా పోలింగ్ మందకొడిగా జరగడంతో అధికారులు పెదవి విరుస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాన్ని ఊదరగొట్టిన నాయకులు ఓటర్లను బూత్‌ల్లోకి రప్పించలేకపోయారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పోలింగ్ బూతుల్లో ఇప్పటి వరకూ ఓటర్లే రాలేదు. ఘన చర్రిత కలిగిన భాగ్యనగరానికి ఇలాంటి ఓటింగ్  సిగ్గుచేటు అని పలువురు విశ్లేషకులు విమర్శిస్తున్నారు. 

Updated Date - 2020-12-01T21:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising