హైదరాబాద్: గౌలిపురా 61,62 పోలింగ్ కేంద్రాల్లో రభస
ABN, First Publish Date - 2020-12-01T20:03:34+05:30
హైదరాబాద్లోని గౌలిపురా 61,62 పోలింగ్ కేంద్రాల్లో రభస జరిగింది.
హైదరాబాద్: నగరంలోని గౌలిపురా 61,62 పోలింగ్ కేంద్రాల్లో రభస జరిగింది. పోలింగ్ బూత్లో బీజేపీ నేతలు కరపత్రాలు పంచారని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రీ ఎన్నికల సిబ్బందిని నిలదీశారు. కరపత్రాలు పంచిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని పంపించివేస్తామని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు శాంతించారు.
Updated Date - 2020-12-01T20:03:34+05:30 IST