యాలకులతో ఫేస్ప్యాక్!
ABN, First Publish Date - 2020-09-28T21:54:01+05:30
ముఖం మీది మచ్చలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి. వాటిని పోగొట్టడం అనుకున్నంత కష్టమైన పనేమి కాదు. సెలూన్ లేదా ప్లారర్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కిచెన్లో లభించే
ఆంధ్రజ్యోతి(28-09-2020)
ముఖం మీది మచ్చలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి. వాటిని పోగొట్టడం అనుకున్నంత కష్టమైన పనేమి కాదు. సెలూన్ లేదా ప్లారర్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కిచెన్లో లభించే యాలకులతో మచ్చలను మాయం చేసి, అందాన్ని పెంచుకోవచ్చు. ఎలాగంటే...
యాలకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అన్నివిధాలా చర్మానికి రక్షణనిస్తాయి. అంతేకాదు ఎలర్జీలను తగ్గించి, చర్మానికి సాంత్వననిస్తాయి.
పచ్చిపాలు, రెండు మూడు యాలకులు, కొద్దిగా తేనె తీసుకోవాలి. యాలకులను పొడి చే సి పాలలో కలపాలి. తరువాత టీ స్పూన్ తేనె వేసి పేస్ట్లా వచ్చేంత వరకూ కలపాలి.
ఈ పేస్ట్ను ముఖం మీద మచ్చలు, మొటిమలు ఉన్నచోట మసాజ్ చేస్తున్నట్టుగా రాసుకోవాలి. 15 నిమిషాలయ్యాక చల్లని నీళ్లలో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే ముఖం మృదువుగా మారుతుంది.
Updated Date - 2020-09-28T21:54:01+05:30 IST