ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి ద్వారానే అలర్జీ!

ABN, First Publish Date - 2020-08-04T21:21:24+05:30

తల్లి పాలు బిడ్డకు అమృత సమానం. అయితే కొంతమంది పసికందుల్లో తల్లి పాలు అలర్జీని కలిగిస్తాయి. ఇందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(04-08-2020)

తల్లి పాలు బిడ్డకు అమృత సమానం. అయితే కొంతమంది పసికందుల్లో తల్లి పాలు అలర్జీని కలిగిస్తాయి. ఇందుకు దోషం తల్లిపాలలో కాదు, తల్లి తినే ఆహారంలో ఉంటుంది. ఒంటి మీద దద్దుర్లు, అపానవాయువులు వదలడం, త్రేన్పులు, వాంతులు, బంక విరేచనాలు, బిడ్డ చికాకుగా, ఏడుస్తూ ఉండడం... ఇవన్నీ తల్లిపాలు సరిపడని పసికందుల్లో కనిపించే ప్రధాన లక్షణాలు. బిడ్డలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. 


అలర్జీ కారకాలు: తల్లి పాలు బిడ్డకు అలర్జీని కలిగించవు. అయితే తల్లి తీసుకునే ఆహారంలో ఆవు పాలు, సోయా, వేరుసెనగలు, ఇతర నట్స్‌, గుడ్లు, గోధుమలు, షెల్‌ ఫిష్‌ ఉంటే వాటి వల్ల పాలు తాగే బిడ్డకు అలర్జీ తలెత్తుతుంది. తల్లి ఆయా పదార్థాలు తిన్న అరగంటలోనే వాటిలోని మాంసకృత్తులు స్వల్ప పరిమాణాల్లో తల్లి పాలల్లోకి చేరతాయి. తల్లి పాలు తాగడం ద్వారా అవి బిడ్డలోకి చేరి అలర్జీని కలిగిస్తాయి. 


కనిపెట్టాలి: బిడ్డకు అలర్జీకి కారణం అవుతున్న పదార్థాలను తల్లులు తెలివిగా కనిపెట్టాలి. ఏవి తిన్న తర్వాత బిడ్డలో అలర్జీ తలెత్తుతుందో ఒక్కొక పదార్థాన్నీ మార్చి, మార్చి కనిపెట్టాలి. ఏ పదార్థాన్ని ఆపిన తర్వాత బిడ్డలో అలర్జీ లక్షణాలు ఆగుతున్నాయో తెలుసుకోవాలి. ఇందుకు ఐదు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. అలా కనిపెట్టిన పదార్థాన్ని ఆహారంలో లేకుండా చూసుకోవాలి.


Updated Date - 2020-08-04T21:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising