ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కాలేజీలపై చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2020-12-19T15:29:11+05:30

నిర్దేశిత ఫీజు కంటే అదనంగా చెల్లించలేదన్న కారణంగా విద్యార్థులకు టెన్త్‌, ఇంటర్‌ సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వని జూనియర్‌ కాలేజీల మేనేజ్‌మెంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీజీపీకి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి లేఖ 

అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): నిర్దేశిత ఫీజు కంటే అదనంగా చెల్లించలేదన్న కారణంగా విద్యార్థులకు టెన్త్‌, ఇంటర్‌ సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వని జూనియర్‌ కాలేజీల మేనేజ్‌మెంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ లేఖ రాశారు. ట్యూషన్‌ ఫీజు, ఇతర కారణాలతో జూనియర్‌, సీనియర్‌ ఇంటర్‌ పాసైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలుపుదల చేశారంటూ పలువురు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఇతర కాలేజీల్లో చేరే పరిస్థితి లేక ఆయా విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని వివరించారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, మేనేజ్‌మెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అందిన ఫిర్యాదులను ఆ లేఖతో జత చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Updated Date - 2020-12-19T15:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising