28న ఆర్జీయూకేటీ సెట్
ABN, First Publish Date - 2020-11-18T16:24:00+05:30
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఆర్జీయూకేటీ సెట్)కు మొత్తం 88,961
88,961 మంది విద్యార్థుల దరఖాస్తు..
22 నుంచి హాల్టికెట్లు
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఆర్జీయూకేటీ సెట్)కు మొత్తం 88,961 దరఖాస్తులు అందాయి. నవంబరు 28న ఈ పరీక్ష జరగనుంది. నూజివీడు, ఆర్.కె.వ్యాలి(ఇడుపులపాయ), శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంగణాల్లో ఆరేళ్ల సమీకృత విద్యతో కూడిన బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2020-21 విద్యా సంవత్సరానికి ఈ సెట్ నిర్వహించనున్నారు. గతనెల 22న నోటిఫికేషన్ విడుదల చేయగా ఏపీ నుంచి 86,617మంది, తెలంగాణ నుంచి 2,344మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కడప జిల్లాలో అత్యధికంగా 9,440మంది, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 4,182 మంది ఉన్నారు. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ నుంచి 520 మంది, అత్యల్పంగా మహబూబ్నగర్ నుంచి 156మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం 637 సెంటర్లు (ఏపీలో 629, తెలంగాణలో 8) ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 100మంది అభ్యర్థులు నమోదైన ప్రతి మండలంలో ఒక పరీక్షా కేంద్రం ఉంటుంది. అంతకంటే తక్కువగా ఉంటే సమీపంలోని సెంటర్కు వారిని కేటాయిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ(గుంటూరు), ఎస్వీయూ(తిరుపతి), డా.వైఎస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం (వెంకటరామన్నగూడెం)ల్లో రెండు, మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఈ పరీక్ష రాసినవారు అర్హులు. పదో తరగతి స్థాయిలో గణితం(50), భౌతికశాస్త్రం(25), జీవశాస్త్రం(25) నుంచి మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆఫ్లైన్లోనే ఓఎంఆర్ షీట్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 22 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆర్జీయూకేటీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ హరినారాయణ మంగళవారం ప్రకటించారు.
Updated Date - 2020-11-18T16:24:00+05:30 IST