హెచ్సీయూ వీసీ పదవీకాలం పొడిగింపు
ABN, First Publish Date - 2020-09-23T16:32:24+05:30
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ అప్పారావు పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగించి
గచ్చిబౌలి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ అప్పారావు పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు మంగళవారం తెలిపారు. ఆయన పదవీకాలం సెప్టెంబరు 22, 2020తో ముగిసిన విషయాన్ని వర్సిటీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే మరో ఏడాది పాటు అప్పారావు పదవిలో కొనసాగాలని.. కొత్త వీసీ వచ్చేంత వరకు ఉండాలని.. ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అది వర్తించేలా ఉత్తర్వులు వచ్చాయని వర్సిటీ వర్గాలు పేర్కొన్నారు.
Updated Date - 2020-09-23T16:32:24+05:30 IST