విద్యతోనే బంగారు భవిష్యత్
ABN, First Publish Date - 2020-01-27T15:33:07+05:30
కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల విద్యార్థులకు పాఠశాల పూర్వవిద్యార్థి ఆవుల యుగంధర్ అధ్యర్యంలో 70 మంది
ఉప్పరపల్లి ZPSS పూర్వ విద్యార్థి ఆవుల యుగంధర్ యాదవ్
ZPSS విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనీర్లు పంపిణీ
మహబూబాబాద్: కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల విద్యార్థులకు పాఠశాల పూర్వవిద్యార్థి ఆవుల యుగంధర్ అధ్యర్యంలో 70 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనీర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి యుగేందర్ మాట్లాడుతూ.. విద్యతోనే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా తాము చదువుకున్న పాఠశాల, ఊరు బాగోగుల కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లి ఇంచార్జి సర్పంచ్ సారయ్య, మాజీ సర్పంచ్ మహేశ్వర చారి, సుధాకర్ గౌడ్, HM విజయ సుశీల, తండా శీను, రాములు, వెంకన్న, ఆవుల కట్టయ్య, యకరాజ్యం, పోలేపాక ఉప్పలయ్య, గుడ్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు యాకబరం, రాందాస్, శంకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-01-27T15:33:07+05:30 IST