4 వర్సిటీల వీసీ పోస్టులకు నోటిఫికేషన్
ABN, First Publish Date - 2020-01-28T16:04:25+05:30
రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాల వైస్చాన్సెలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నతవిద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది.
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాల వైస్చాన్సెలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నతవిద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఆచార్య నాగార్జున(గుంటూరు), ఆంధ్రా (విశాఖపట్నం), రాయలసీమ(కర్నూలు), శ్రీవెంకటేశ్వర (తిరుపతి) విశ్వవిద్యాలయాల వీసీ పోస్టుల కోసం బయోడేటా, అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తులను ఫిబ్రవరి 18లోగా తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కార్యాలయానికి పంపాలని పేర్కొంది.
Updated Date - 2020-01-28T16:04:25+05:30 IST