సరిహద్దు వివాదం
ABN, First Publish Date - 2020-09-11T06:22:17+05:30
ఇండియా-చైనా సరిహద్దు వివాదంపై ఏ ప్రకటన చేసినా చౌ ఎన్-లై ఎన్నెన్నో శ్రీరంగనీతులు ఏకరవు పెడుతున్నాడు. కాని, లోకం ఆయన భ్రమిస్తున్నంత గుడ్డిది కాదు...
తాత్కాలిక ప్రయోజనాలను సాధించుకోవడం కోసం తాను నమ్మిన న్యాయ సూత్రాలకు, ధర్మ సూత్రాలకు తిలోదకాలను వదిలే దుర్గతిలో భారత ప్రభుత్వం పడలేదు; పడబోదు; అందువల్లనే పంచశీలకు వ్యతిరేకంగా చైనా సంచరిస్తున్నంత మాత్రం చేత పంచశీల సూత్రాలకే స్వస్తి చెప్పవలెనన్న వాదాన్ని అది తిరస్కరిస్తున్నది.
తాత్కాలిక ప్రయోజనాలను సాధించుకోవడం కోసం తాను నమ్మిన న్యాయ సూత్రాలకు, ధర్మ సూత్రాలకు తిలోదకాలను వదిలే దుర్గతిలో భారత ప్రభుత్వం పడలేదు; పడబోదు; అందువల్లనే పంచశీలకు వ్యతిరేకంగా చైనా సంచరిస్తున్నంత మాత్రం చేత పంచశీల సూత్రాలకే స్వస్తి చెప్పవలెనన్న వాదాన్ని అది తిరస్కరిస్తున్నది. చైనా తన పట్ల అన్యాయంగా ప్రవర్తించినంత మాత్రం చేత ఐక్యరాజ్య సమితిలో పెకింగ్ ప్రతినిధులకే స్థానమివ్వవలెనన్న తన పూర్వ వైఖరిని మార్చుకొనడానికి అది నిరాకరిస్తున్నది. చైనాపై పగసాధించాలని ఇండియా నడచిన వంకర నడక పేరుకైనా లేకపోగా, ఇండియాపై కక్షతో పెకింగ్ ప్రభుత్వం నడుస్తున్నవన్నీ వంకర నడకలే!
(1961 జనవరి 20 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం
‘చౌ శ్రీరంగనీతులు’ నుంచి)
Updated Date - 2020-09-11T06:22:17+05:30 IST