ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు ఫ్లాట్లున్నా.. గుడి ముందు భిక్షాటన.. చివరికి కోడలి చేతిలో..

ABN, First Publish Date - 2020-07-18T02:13:41+05:30

ఆమె పేరిట ముంబై మహానగరంలో నాలుగు ఫ్లాట్లున్నాయి. అయినాసరే ప్రతిరోజూ ఓ జైన దేవాలయం ముందు కూర్చొని భిక్షాటన చేస్తుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఆమె పేరిట ముంబై మహానగరంలో నాలుగు ఫ్లాట్లున్నాయి. అయినాసరే ప్రతిరోజూ ఓ జైన దేవాలయం ముందు కూర్చొని భిక్షాటన చేస్తుంటుంది. ఇంట్లో అత్తా కోడళ్ల మధ్య ఎప్పుడూ గొడవలే. ఈ తగాదాల కారణంగా ఆ కోడలు అత్తను హతమార్చింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. స్థానికంగా నివశించే ఓ 70ఏళ్ల బామ్మ కథ ఇది. ముంబైలో నాలుగు ఫ్లాట్లు కొన్న ఆమె.. మూడింటిని అద్దెలకిచ్చింది. ఒక దానిలో దత్తత తీసుకున్న తన కుమారుడి కుటుంబంతో కలిసి ఉంటోంది. అయితే ఈ నాలుగు ఫ్లాట్లు తన పేరున రాయాలని కోడలు గొడవ చేసేది. దీనికి ససేమిరా అనడంతో భయంకరమైన నిర్ణయం తీసుకున్న ఆ కోడలు.. అత్తను హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు కోడల్ని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.

Updated Date - 2020-07-18T02:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising