ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అని తేలిన తర్వాత.. దుబాయి ప్రయాణం!

ABN, First Publish Date - 2020-07-22T04:10:30+05:30

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణే: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ముంబై, పూణే నగరాల్లో పరిస్థితిని అదుపు చేయడానికి అధికారులు నానాతిప్పలూ పడుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనా అని తేలిన తర్వాత కూడా ఓ మహిళ దుబాయికి వెళ్లింది. పూణేకు చెందిన ఈమెకు కరోనా సోకినట్లు జూలై 11న వెల్లడయింది. అయితే ఆమెలో వ్యాధి లక్షణాలు కనిపించలేదు. దీంతో ఆమెను 14రోజులు హోంక్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేసిన సదరు మహిళ.. దుబాయి వెళ్లింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు మహిళ యూఏఈ నివాసి అని తెలిపారు.

Updated Date - 2020-07-22T04:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising