ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-05-29T17:00:05+05:30

భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదనే వేదనతో భార్య నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదనే వేదనతో భార్య నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతానికి చెందిన జ్యోతి అనే మహిళ ఒంటికి నిప్పంటించుకుంది. 90 శాతం కాలిన గాయాలతో జ్యోతిని ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి మరణించిందని తేల్చారు. తనకు స్మార్ట్ ఫోన్ కొని ఇవ్వాలని జ్యోతి భర్తను కోరింది. భర్త ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కొనేదిలేదని చెప్పి, లాక్ డౌన్ తర్వాత కొంటానని చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-29T17:00:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising