ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాల్వలో వెలుగుచూసిన మహిళ మృతదేహం...ప్రియుడి అరెస్ట్

ABN, First Publish Date - 2020-08-11T17:32:49+05:30

వారం రోజుల నుంచి గల్లంతైన వితంతువు కాల్వలో మృతదేహమై ఘజియాబాద్ నగరంలోని ఇందిరాపురం ప్రాంతంలోని హిందాన్ కెనాల్ లో వెలుగుచూసింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజియాబాద్ : వారం రోజుల నుంచి గల్లంతైన వితంతువు కాల్వలో మృతదేహమై ఘజియాబాద్ నగరంలోని ఇందిరాపురం ప్రాంతంలోని హిందాన్ కెనాల్ లో వెలుగుచూసింది. యూపీలోని ఘజియాబాద్ జిల్లా మకన్ పూర్ గ్రామానికి చెందిన వితంతువు అయిన 35 ఏళ్ల మహిళ వారం రోజుల నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, వారికి మహిళ మృతదేహం కాల్వలో లభించింది. స్పాలో పనిచేస్తున్న వితంతువుతో ముస్తఫా అనే యువకుడు అక్రమ సంబంధం పెట్టుకొని సహజీవనం చేశాడు. తన జీవనోపాధి కోసం డబ్బులివ్వాలని మహిళ ముస్తఫాను డిమాండు చేసింది. దీంతో డబ్బులిస్తామని చెప్పి రప్పించిన ప్రియుడు ముస్తఫా మహిళ గొంతును కత్తితో కోసి చంపి, మృతదేహాన్ని కాల్వలో పడేశాడు. పోలీసులు నిందితుడైన ముస్తఫాను అరెస్టు  చేసి అతను అందించిన సమాచారం ప్రకారం మహిళ హత్యకు వాడిన కత్తి, మృతురాలి మొబైల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ముస్తఫాను అరెస్టు చేశామని ఘజియాబాద్ పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-08-11T17:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising