ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబర్‌లో పెళ్లి.. జనవరిలో భార్య ఆత్మహత్య.. ఇప్పుడు భర్త కూడా..

ABN, First Publish Date - 2020-03-22T19:17:22+05:30

వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు మాసాల క్రితం భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొగా, ఇదే కేసులో జైల్‌ నుంచి విడుదలై భర్త కూడా శనివారం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని మలక్‌పేటకు చెందిన లక్ష్మీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనస్థలిపురం, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు మాసాల క్రితం భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొగా, ఇదే కేసులో జైల్‌ నుంచి విడుదలై భర్త కూడా శనివారం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని మలక్‌పేటకు చెందిన లక్ష్మీ, చంద్రశేఖర్‌ కుమార్తె పల్లవి(29)ని నల్లగొండ జిల్లా, మునుగోడుకు చెందిన సోమవరపు విజయలక్ష్మి, శ్రీహరి కుమారుడు సంతోష్‌ కుమార్‌(32)కు ఇచ్చి గతేడాది డిసెంబర్‌ 8న వివాహం చేశారు. అనంతరం దంపతులిద్దరూ వనస్థలిపురంలోని శ్రీనివాసపురం కాలనీలో ఉంటున్నారు. వీరిద్దరూ ఎంబీఏ పూర్తి చేశారు. పల్లవి ఓ ప్రైవేటు కంపెనిలో పని చేస్తుండగా, సంతోష్‌ కుమార్‌ మనుగోడులో భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీని నిర్వహస్తున్నాడు.


భర్త, అత్తామామ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో మనస్తాపానికి గురైన పల్లవి జనవరి 31న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భర్త సంతోష్‌ కుమార్‌ను వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన సంతోష్‌కుమార్‌ శనివారం వనస్థలిపురం, ఆటోనగర్‌లోని ఓయో లాడ్జ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  వనస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-22T19:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising