బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-03-08T09:19:49+05:30
భర్త మరణంతో మనోవేదనకు గురైన ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుచ్చెయ్యపేటకు...
కందిపూడి (బుచ్చెయ్యపేట), మార్చి 7 : భర్త మరణంతో మనోవేదనకు గురైన ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుచ్చెయ్యపేటకు చెందిన దేముడమ్మకు పదేళ్ల క్రితం కందిపూడికి చెందిన సబ్బిడి తాతబాబుతో వివాహం జరిగింది. వీరికి సంతానం లేదు. భర్త తాతబాబు పచ్చకామెర్లకు గురై ఫిబ్రవరి మొదటి వారంలో మృతి చెందాడు. నాటి నుంచి దేముడమ్మ మనోవేదనకు లోనైంది. దీంతో శుక్రవారం సాయంత్రం వారాడ పొలంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మేనమామ సుంకర మహలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ డి.వెంకన్న కేసు నమోదు చేశారు.
Updated Date - 2020-03-08T09:19:49+05:30 IST