ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడిని హతమార్చిన ప్రియురాలు

ABN, First Publish Date - 2020-12-12T16:47:58+05:30

అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అశ్లీల వీడియోలు బహిర్గతం చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో విసిగిపోయిన ఓ మహిళ తన సోదరుడితో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలీఘడ్ (ఉత్తరప్రదేశ్): అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అశ్లీల వీడియోలు బహిర్గతం చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో విసిగిపోయిన ఓ మహిళ తన సోదరుడితో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలో వెలుగుచూసింది. అలీఘడ్ నగరంలోని గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన యశోదా దేవికి పారిశుద్ధ్య కార్మికుడు దీపు కాంతితో అక్రమసంబంధం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకొని దీపు కాంతి మహిళ అశ్లీల వీడియోను చిత్రీకరించాడు. అశ్లీల వీడియోను బహిర్గతం చేస్తానంటూ మహిళను వేధించాడు.


 దీంతో యశోదా దేవి తన సోదరుడు రాజ్ కుమార్ తో కలిసి దీపుకాంతిని హతమార్చారు. డిసెంబరు 10వతేదీ దీపుకాంతి మృతదేహం నాలాలో లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇతను హత్యకు గురయ్యాడని తేలింది. అక్రమ సంబంధం పెట్టుకొని, అశ్లీల వీడియో తీసి దాన్ని బయటపెడతానంటూ వేధించినందుకే తాము దీపు కాంతిని హతమార్చామని యశోదాదేవి, ఆమె సోదరుడు రాజ్ కుమార్ లు చెప్పారు. పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-12T16:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising