ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి

ABN, First Publish Date - 2020-05-26T20:48:22+05:30

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి చెందిన ఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి చెందిన ఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాగర్ రింగ్ రోడ్‌లో ఉన్న అలేఖ్య టవర్స్‌లోని 14వ అంతస్థులో నివసిస్తున్న రఘురాం, పద్మల కూతురు సాహితి. ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (బీడీఎస్) నాలుగో సంవత్సరం చదువుతోంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో తన నివాసంలో బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుంచి దూకింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో.. చాలాకాలంగా మనోవేదనకు గురైన సాహితి ఆత్మహత్య చేసుకున్నట్టు తండ్రి రఘురామ్ తెలిపారు. ఇదిలా ఉంటే అనుమానస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-05-26T20:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising